టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మహానటి కీర్తిసురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తిచేసుకుని 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున చిత్రబృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు.ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తన పని మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు కంటే ముందుగానే కీర్తి సురేష్ ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే తాను డబ్బింగ్ చెబుతున్నటువంటి ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ డబ్బింగ్ పూర్తి అయిన విషయాన్ని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదలకు సిద్ధమైంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించగా,మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.







