యునైటెడ్ స్టేట్స్లో( US ) జన్మించిన 26 ఏళ్ల వైద్య విద్యార్థి( Medical Student ) ఇండియాలో ఒక తప్పు చేస్తూ అడ్డంగా దొరికింది.దాంతో నిష్క్రమణ అనుమతిని పొందేందుకు ఎన్నారై లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కేటగిరీ మెడికల్ సీటు ఫీజులకు సమానమైన MBBS ఫీజు చెల్లించాలని కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ విద్యార్థిని ప్రభుత్వ కోటాలో చదువుకుంది.ఆ సీటు కోసం తనను తాను భారతీయురాలిగా నమ్మ బలికింది.
ఎన్నారై లేదా ఓసీఐ కేటగిరీ మెడికల్ సీటు కోసం పూర్తి కోర్సు ఖర్చులు చెల్లించినప్పుడే విద్యార్థికి ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది.కోర్టు నిర్ణయం విదేశీ విద్యార్థుల ఫీజు నిబంధనలపై చర్చకు దారితీసింది.
పిటిషనర్ 1997, ఫిబ్రవరి 5న టేనస్సీలోని నాష్విల్లేలో జన్మించింది.ఆమె తల్లిదండ్రులు భారతీయ పౌరులు.
వారు యునైటెడ్ స్టేట్స్లోని భారత రాయబార కార్యాలయానికి ఆమె పుట్టిన విషయాన్ని నివేదించారు.ఆ తర్వాత ఆమెకు యూఎస్ పాస్పోర్ట్ లభించింది.
పిటిషనర్కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె టూరిస్ట్ వీసాపై భారతదేశాన్ని సందర్శించి ప్రాథమిక పాఠశాలలో చేరింది.గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె మార్చి 30, 2015న CET తీసుకుంది.తన జాతీయతను భారతీయురాలిగా పేర్కొంటూ.500-ప్లస్ రేటింగ్ను సాధించింది.అనంతరం ఆమెకు మాండ్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రభుత్వ కోటా సీటు సాధించింది.అదే సీటును సద్వినియోగం చేసుకుంటూ ఎంబీబీఎస్ ( MBBS ) పూర్తి చేసింది.
పిటిషనర్ US కాన్సులేట్ జనరల్లో కొత్త పాస్పోర్ట్ కోసం దాఖలు చేసి అది కూడా సంపాదించింది.2021, మార్చి 17న ఆమెకు ఒక సంవత్సరం US పాస్పోర్ట్ జారీ అయ్యింది.ఆమె కొత్త US పాస్పోర్ట్ను ఉపయోగించి, నిష్క్రమణ అధికారం కోసం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్కి దరఖాస్తు చేసింది.దానిని ప్రభుత్వం రిజెక్ట్ చేసింది.దాంతో పిటిషనర్ 2003లో భారతదేశానికి వచ్చినప్పుడు తాను మైనర్ అని, తన తల్లి సింగిల్ పేరెంట్ అని పేర్కొంది.దేశ పౌరసత్వ చట్టంలోని చిక్కులు లేదా పాస్పోర్ట్లోని చిక్కుల గురించి తనకు తెలియదు అని వెల్లడించింది.
న్యాయమూర్తి ఎం నాగ ప్రసన్న తన తీర్పులో, పిటిషనర్ “సిగ్గులేకుండా మోసాన్ని ఆశ్రయించారు.అనైతిక మార్గాల ద్వారా ఆమె లక్ష్యాలను పొందారు, ఇది అసహ్యకరమైనది” అని పేర్కొన్నారు.
భారతీయురాలిగా క్లెయిమ్ చేయడం ద్వారా ప్రయోజనాలను పొందినప్పటికీ, భారతదేశంలో వృత్తిని కొనసాగించడానికి ఆమెకు ఆసక్తి లేదు.ఇది చాలా బాధాకరమని న్యాయమూర్తి అన్నారు.