ఓ 15ఏళ్ల యువతి ఎవరూ చేయని ఓ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ప్రకృతిని పరిరక్షించే భాగంలో ఎవరికోసమో ఎదురు చూడకుండా, స్వనిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో రాబోతున్న ఓ విపత్తుని వెలుగెత్తి చాటుతుతోంది.అవును… భవిష్యత్తులో ఆహార కొరత ఏవిధంగా ఉంటుందో గుర్తించిన ఆ బాలిక అలుపెరుగని సాహాసం చేస్తోంది.ఈ క్రమంలో ‘సేవ్ సాయిల్’ నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టింది.
ఆమె పేరు వెన్నెల.సేవ్ సాయిల్ నినాదంతో 5 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర కొనసాగిస్తోంది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నుంచీ 21 రోజులుగా 5000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేస్తోంది.
వివరాల్లోకి వెళితే, కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన వెన్నెల అనే అమ్మాయి ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసింది.
రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడం వలన భూసారం తగ్గిపోతున్న క్రమంలో ప్రజలలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టానని చెబుతోంది వెన్నెల.NTR జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వెన్నెలను విజయవాడలో కలెక్టర్ క్యాంపు ఆఫీసులో రిసీవ్ చేసుకున్నారు.
పాలసీ మేకర్స్, వ్యవసాయంపై అవగాహన ఉన్న వారు చేయాల్సిన పని చిన్నపిల్ల చేయడాన్ని ఆయన అభినందించారు.
వెన్నెలకు తన వంతుగా 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు కలెక్టర్ ఢిల్లీరావు.జగ్గీ వాసుదేవ్ వల్ల ప్రభావితం అయ్యి ఇలా యాత్ర చేస్తున్నానని వెన్నెల చెప్పడం హర్షణీయం.బీద కుటుంబం నుంచీ వచ్చిన తను 2 తెలుగు రాష్ట్రాల రైతులను కలిసి భూసారం పెంచాలనే విషయంపై అవగాహన కల్పిస్తానంటోంది.
రాబోయే తరాలను రక్షించాలని లక్ష్యంతోనే తాను ఈ యాత్ర చేపట్టానని తెలిపింది.ప్రభుత్వాలు సేవ్ సాయిల్ పై ఒక పాలసీ తీసుకురావాలంటోంది వెన్నెల.