యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా ఫహద్ ఫాసిల్ మరియు విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన విక్రమ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.విక్రమ్ సినిమా కు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.
ఆయన దర్శకత్వం లో వచ్చిన ఖైదీ సినిమా తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే తెలుగు లో విక్రమ్ సినిమా కు మంచి బజ్ ఉంది.
అయితే మొదట విక్రమ్ ను తెలుగు లో డైరెక్ట్ గా విడుదల చేయాలని భావించారు.కమల్ హాసన్ ఈ సినిమా ను నిర్మించడంతో ఆయనే తెలుగు లో విడుదల చేయాలని భావించినా అది సాధ్యం కాదు అనే ఉద్దేశ్యంతో చివరకు నితిన్ తండ్రి అయిన ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డికి పంపిణీ హక్కులను ఇవ్వడం జరిగింది.
సుధాకర్ రెడ్డి తాజాగా చెన్నై వెళ్లి అక్కడ కమల్ హాసన్ ను కలిసి విక్రమ్ సినిమా డబ్బింగ్ రైట్స్ కు సంబంధించిన ఒప్పందం చేసుకుని వచ్చారు.
దాదాపుగా పాతిక కోట్ల కు గాను విక్రమ్ తెలుగు రైట్స్ ను సుధాకర్ రెడ్డి కొన్నాడు అంటున్నారు.
ఈమధ్య కాలంలో కమల్ హాసన్ నటించిన సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.తెలుగు లో కమల్ సినిమా లు పది కోట్లు రాబట్టడం చాలా పెద్ద విషయం.
అలాంటిది ఏకంగా పాతిక కోట్లకు ఎలా విక్రమ్ ను నితిన్ తండ్రి కొనుగోలు చేశాడు అంటూ జుట్టు పీక్కుంటున్నారు.మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం పాతిక కోట్లు అంటూ వారు బలంగా నమ్ముతున్నారు.
కాని అంత సీన్ లేదని చాలా మంది కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఖచ్చితంగా విక్రమ్ సినిమా తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది.తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3వ తారీకున దాదాపుగా 500 నుండి 600 స్క్రీన్ ల్లో విక్రమ్ ను సుధాకర్ రెడ్డి విడుదల చేసేందుకు ఇప్పటికే థియేటర్లను బ్లక్ చేయడం జరిగిందట.