మగాడివే కాదని భర్తను తిట్టేదాన్నన్న నటి.. 600 ఎకరాలు పోయిందంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.కృష్ణంరాజు గారితో నిత్య సుమంగళి చేశామని ఆమె తెలిపారు.

 Kakinada Shyamala Comments About Her Husband Details Here Goes Viral In Social M-TeluguStop.com

ఆ సినిమాకు ఫైనాన్షియర్ గా పని చేశానని ఆమె తెలిపారు.పచ్చబొట్టు అనే సినిమా రిలీజ్ కాలేదని కృష్ణంరాజు ఆ సినిమాలో డ్యూయల్ రోల్ లో చేశారని కాకినాడ శ్యామల అన్నారు.

ఆ సమయంలో లక్ష రూపాయలు పోయిందని ఆమె పేర్కొన్నారు.

మరో చరిత్ర సినిమాలో నటించానని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు.

ఆ సినిమాలో గయ్యాళి పాత్ర కోసం నన్ను పరిశీలించారని ఆ తర్వాత కమల్ తల్లి పాత్రకు ఎంపిక చేశారని ఆమె పేర్కొన్నారు.నేను పాటలు పాడదామని సినిమాల్లోకి వచ్చానని కాకినాడ శ్యామల కామెంట్లు చేశారు.

నా భర్త వాళ్ల నాన్న 600 ఎకరాల ఆసామి అని ఆమె తెలిపారు.మా ఆయనకు 120 ఎకరాలు వచ్చిందని కాకినాడ శ్యామల పేర్కొన్నారు.

Telugu Actresskakinada, Krishnam Raju-Movie

మా ఆయన బాగా రసికుడు అని 600 ఎకరాలు 38 ఎకరాలు అయిందని మగాడు అంటే డబ్బు సంపాదించి భార్యాబిడ్డలకు ఇవ్వాలని అలాంటి మగాడిని నేను ఇష్టపడతానని నా దృష్టిలో నువ్వు మగాడివే కాదని అన్నానని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సమయంలో మా ఆయన ట్రావెల్స్ లో జీతానికి పని చేసేవారని ఆమె అన్నారు.63 ఏళ్ల వయస్సులో ఆయన చనిపోయారని కాకినాడ శ్యామల అన్నారు.

Telugu Actresskakinada, Krishnam Raju-Movie

మద్రాస్ లో ఆయన క్లబ్ లో ఉండేవారని కాకినాడ శ్యామల తెలిపారు.ఆ ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే కోట్ల రూపాయల విలువ చేసేదని ఆమె అన్నారు.కాకినాడ శ్యామల చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేవుడు చూసుకుంటాడని మనం నిమిత్త మాత్రులం అని ఆమె చెప్పుకొచ్చారు.కాకినాడ శ్యామల ప్రస్తుతం ఎక్కువ సినిమాలలో నటించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube