ప్రకాశం జిల్లా ఒంగోలులో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో చర్చి సెంటర్, అద్దంకి బస్టాండ్ లో అర్ధరాత్రి ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.కాగా ఈనెల 21, 22 వ తేదీల్లో నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఒంగోలులోకి ప్రవేశించనుంది.
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.మరోవైపు వైసీపీ నేతలే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింటారన్న అనుమానం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు వాటిని తొలగించారు.