నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చాలా మంది హీరోలు ఆయన పేరు చెప్పుకున్న ఇండస్ట్రీ లోకి వచ్చారు.మరి వారిలో తారకరత్న ఒకరు.
ఈయన హీరోగా కూడా పలు సినిమాలు చేసాడు.ఒకటి అరా సినిమాలతో ఆకట్టు కున్నప్పటికీ హీరోగా కొనసాగలేక పోయాడు.
అయితే ఈయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు నచ్చిన పాత్రలను చేస్తూ వస్తున్నాడు.
ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరో వైపు ఏపీ రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు.
అయితే ఈయన రెండు వైపులా బిజీగా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే అనుకోని విధంగా తీవ్ర అస్వస్థతకి లోనయ్యాడు.ఏపీ లో తెలుగుదేశం అధ్యక్షుడు నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా తారకరత్న కూడా పాల్గొన్నారు.
ఈ పాదయాత్రలో భారీ అభిమానులు, పార్టీ సభ్యులు తరలి వచ్చారు.
వీరి భారీ మోహరింపు కారణంగా తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.భారీగా అభిమానులు చుట్టు ముట్టడంతో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.దీంతో ఈయనను వెంటనే బెంగుళూరు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
మరి తారకరత్న ప్రెజెంట్ ప్రాణ పోరాటం చేస్తున్నారు.అంతా నార్మల్ గానే ఉంది రికవర్ అవుతాడు అనుకున్నారు.
కానీ చూస్తుంటే పరిస్థితి మరింత క్లిష్టంగా మారడంతో తారకతర్నను చూసేందుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు బెంగుళూరు చేరుకున్నారు.ఇక్కడ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన తారక్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూస్తుంటే ఎన్టీఆర్ చాలా భావోద్వేగంగా కనిపిస్తున్నారు.ఈ విజువల్స్ ఎన్టీఆర్ ను మరింత ఎమోషనల్ చేస్తున్నాయి.