కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ

సాధారణ ఎన్నికల సమయం వస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని విపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తున్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 30న ముగియనున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగింపు సభ నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో దేశంలో భావసారూప్యత కలిగిన 24 రాజకీయ పార్టీలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు.ఈ మేరకు లేఖలు రాశారు.

అయితే ఖర్గే ఆహ్వానాన్ని బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ తిరస్కరించింది.అదే రోజు పార్టీకి అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభోత్సవం ఉన్న సందర్భంగా సభకు హాజరుకాలేమని జేడీయూ స్పష్టం చేసింది.

అసలు ఎందుకు ఓడారు ? త్రిసభ్య కమిటీ విచారణ
Advertisement

తాజా వార్తలు