అక్రమ అరెస్టులతో వైకాపా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుంది - జనసేన నాయకులు

శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే అక్రమ అరెస్టులతో వైకాపా ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని జనసేన నాయకులు మండిపడ్డారు.విశాఖ విమానాశ్రయంలో శనివారం మంత్రులపై జరిగిన దాడిలో జనసేన ఇన్చార్జిలతో పాటు మరికొంతమంది నాయకులతో పాటు అరెస్టు చేసి విశాఖ జిల్లా పద్మనాభం పోలీస్ స్టేషన్కు అర్ధరాత్రి సమయం లో తరలించారు.

 Janasena Leaders Comments On Illegal Arrests By Ycp Government In Vishakapatnam-TeluguStop.com

విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాహిని పేరిట జనసేన అథినేత పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యకి వస్తుంటే వైకాపా నాయకులకు ఎందుకు అంత భయం అన్నారు.

వైకాపా నాయకుల భూ అక్రమాలు కబ్జాలు ఎక్కడ బయట పడతాయోయని భయంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు.అరెస్టులు నేపథ్యంలో శాంతియుతంగా జనసేన నాయకులు వ్యవహరించాలన్నారు.

బెదిరింపులు భయాందోళనలకు గురిచేస్తే తగ్గేదే లేదని మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పవన్ కళ్యాణ్ పద్మనాభం పోలీస్ స్టేషన్ కు వస్తారనే సమాచారంతోనే జనసైనికులను వేరే స్టేషన్ తరలిస్తున్నారని జనసైనికులు ఆరోపించారు .అరెస్ట్ అయిన వారిలో భీమిలి నియోజవర్గ ఇంచార్జ్ సందీప్, గాజువాక ఇంచార్జ్ తాతారావు, ఎలమంచిలి ఇంచార్జ్ విజయకుమార్ ,పాతపట్నం ఇంచార్జ్ చైతన్య విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్, నాగబాబు పిఏలు శ్రీధర్, ఉమ, పవన్ కళ్యాణ్ ఈవెంట్ ఆర్గనైజర్లు కీర్తేసు, విశ్వక్సేన్ లతో పాటు మరో 11 మంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube