ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నిరకాలుగా సిద్ధం అవుతున్న జనసేన పార్టీ… పార్టీలోకి వివిధ వర్గాల నాయకులను చేర్చుకుంటూ… పార్టీ పదవులు ఇస్తూ… కొద్ది రోజులుగా హడావుడి చేస్తోంది.అదే ఊపుతో పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కసరత్తు చేస్తూ… దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దీనిలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనకు కూడా టికెట్ కావాలి అంటూ.స్క్రీనింగ్ కమిటీకి మొదటి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… పార్టీలో టికెట్ కేటాయింపు తుది నిర్ణయం స్క్రీనింగ్ కమిటీనే తీసుకుంటుందని తెలిపారు.లోక్ సభ, అసెంబ్లీ టికెట్ల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని చెప్పారు.
.