ఏపీలోని కాపు సంఘం నేతలకు జనసేన నేత నాదెండ్ల మనోహార్ కీలక సూచనలు చేశారు.కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
గతంలో జరిగిన తప్పులు జరగకుండా కాపులు జాగ్రత్త పడాలని నాదెండ్ల తెలిపారు.కాపుల ఆలోచనలు మళ్లించేందుకు పేటీఎం బ్యాచ్ లు పని చేస్తున్నాయని విమర్శించారు.
ఈ నేపథ్యంలో కాపులంతా పవన్ కల్యాణ్ పై నమ్మకం ఉంచాలన్నారు.జనసేనను నమ్ముకున్న వారి ఆత్మ గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించబోమని వెల్లడించారు.