ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పర్యటన ఖరారైంది.
ఈ నెల 27వ తేదీ నుంచి పలు కీలక నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.కాగా 27న ఉత్తరాంధ్ర నుంచి జనసేనాని ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

అదేవిధంగా ఈ నెల 26 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ‘ప్రజాగళం( Prajagalam )’ పేరిట ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు.కాగా రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ( TDP, Jana Sena )మరియు బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.







