అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.ఈ యాత్రలో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు.
గతంలో దళితులను చంద్రబాబు కించపరిచారని మంత్రి మేరుగ ఆరోపించారు.పథకాల ద్వారా బడుగుబలహీన వర్గాలకు రూ.2.40 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు.పథకాల ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు.సీఎం జగన్ పాలన వలనే అన్ని వర్గాల్లో సమానత్వం వచ్చిందని పేర్కొన్నారు.జగన్ సామాజిక విప్లవం భావితరాలకు దిక్చూచి కానుందని స్పష్టం చేశారు.







