ఏపీలో జగన్ కొత్త రూల్స్ .. పథకాలకు వరుసగా కోతలు

ఏపీలో సంక్షేమ పథకాలకు వరుసగా కోతలు పడుతున్నాయి.లబ్ధిదారుల ఏరివేతే లక్ష్యంగా సర్వేలు కొనసాగుతున్నాయి.

 Jagan New Rules In Ap Consecutive Cuts To Schemes , Jagan , Jagan New Rules , A-TeluguStop.com

తాజాగా ఆధార్‌సర్వే ద్వారా దాదాపు లక్ష మంది విద్యార్థులను జగనన్న విద్యాదీవెనకు దూరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.గత ప్రభుత్వాల్లో ఏటా ఒక్కసారే మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసేసే విధానానికి జగన్‌ ప్రభుత్వం విద్యాదీవెనగా పేరు మార్చింది.

ప్రారంభంలో నాలుగు విడతల్లో 14లక్షల మందికి మేలు చేస్తామని ప్రకటించింది.ఆ తర్వాత ఆ నాలుగు విడతలను కాస్తా మూడుచేసింది.

రకరకాల రూల్స్‎తో విద్యార్థుల సంఖ్యను 10 లక్షలకు కుదించేశారు.ఇప్పుడు కొత్త రూల్స్‌తో మరిన్ని కోతలకు తెర తీసింది.

ఇలా కోతలు, తీసివేతలతోనే ఇవాళ ఈ పథకం రెండో విడత నిధులు విడుదలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.

జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభంలో 14 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆర్భాటంగా ప్రకటించారు.ఆ తర్వాత నుంచి కోతలు విధిస్తూ ప్రస్తుతానికి 10.82లక్షల మందికి పథకం అమలుచేస్తోంది.ఈసారి అందులోనూ దాదాపు లక్షలమందిని అనర్హులుగా తేల్చేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.మరోవైపు ఒక విద్యాసంవత్సరానికి నాలుగు విడతలుగా విద్యాదీవెన ఇస్తామంటున్న ప్రభుత్వం…ఇప్పుడు విద్యాసంవత్సరం పూర్తవుతున్న వేళ రెండో విడత విద్యాదీవెనను మాత్రం అందిస్తోంది.

మరి మిగిలిన రెండు విడతలు ఎప్పుడు చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకం.గత రెండేళ్లలో అసలు నాలుగు విడతల విద్యాదీవెన ఇవ్వనే లేదు.కేవలం మూడు విడతల విద్యాదీవెననే ఇచ్చి.ఒక విడత విద్యాదీవెనను ఇవ్వలేదు.

అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన మొత్తం కంటే తక్కువ మొత్తమే విద్యార్థులకు ఈ ప్రభుత్వం అందించినట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా ఇప్పడు కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు ముఖ్య మంత్రి జగన్.

అధార్ కార్డు సర్వే ద్వారా విద్యాదీవెన పథకంలో పెద్ద ఎత్తున్న ఏరివెత జరగనుంది.అయితే దాదాపు లక్షమంది విద్యర్థులను జగనన్న విద్యాదీవెనకు సర్వే ద్వారా దూరం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయాత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఒక విద్యా సంవత్సరానికి నాలుగు విడతలుగా ఇస్తామంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క పథకాలకు వరుసగా కోతలు విధిస్తున్నారు.అయితే నాలుగు విడతలుగా విడుదల కావాలసిన విద్యాదీవెన పథకం ఇప్పడు రెండో విడత విద్యాదీవెన మాత్రమే ఏపీ ప్రభుత్వం అందిస్తోంది.

అయితే ఈ పథకం ప్రారంభలో దాదాపు 14 లక్షల మందికి మేలు చేస్తామని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం గతంలో ప్రకటన చేసింది.అయితే ఇప్పడు అదే ప్రభుత్వం రకరకాల రూల్స్ తో ప్రజల జీవితాలను ఆడుకుంటు విద్యాదీవెన పథకం ఇప్పడు 10 లక్షలకు మందికి కుదించింది.

Telugu Aadhaar, Ap, Cm Jagan, Jagan-Political

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారం చేప్పట్టిన తరువాత ముఖ్యమంత్రి జగన్ ఆ పథకం ఈ పథకం అంటూ ప్రజల్లో ఓ మంచి గోప్ప ముఖ్యమంత్రి ఎదగాలని విన్నూత్నం ప్రయాత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇపటివరకు చాలా పథకలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పడు అదే పథకాల్లో ఆ సర్వే ఈ సర్వే అంటు కోతలు విధిస్తున్నారు.ఏపీ ప్రజలు జగన్ చేప్పట్టిన పథకాలపై ఎంతో ఆశ పెట్టుకున్న జనాలు ఇప్పడు సర్వే తో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత రెండేళ్లలో విద్యాదీవెన పథకం అసలు నాలుగు విడతల విద్యాదీవెన ఇవ్వడం లేదు అని ఏపీ ప్రజలు చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో ఇచ్చిన మొత్తం కంటే తక్కువ మొత్తమే విద్యార్థులకు విద్యాదీవెన అందినట్లు సమాచారం.

Telugu Aadhaar, Ap, Cm Jagan, Jagan-Political

ఏపీలో సంక్షేమ పథకాలకు వరుసగా కోతలు విధిచడంతో ఆంధ్రపదేశ్ ప్రజలకు మరో కొత్త టెన్షన్ మొదలవుతుంది.లబ్ధిదారుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం ఆధ్వర్వంలో సర్వేల పేరుతో కోతలు పడుతున్నాయింటు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇలా కోతలు తీసీవేతలతోనే నేడు విద్యాదీవెవన పథకం రెండో విడత నిధులు విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube