ఆ పని చేసి ఎనిమిదేళ్ళవుతోంది... పూజా హెగ్డే

తెలుగు సినిమాలను నిరంతరం అనుసరించే వారికి పూజా హెగ్డే పరిచయం అక్కరలేని పేరు.

ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ తన అందచందాలతో కుర్ర కారును మత్తెక్కిస్తోంది.

ముకుంద సినిమా ఆశించిన ఫలితం రాకపోయినా నటిగా పూజాకు మంచి గుర్తింపు వచ్చింది.అందుకే తరువాత కూడా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

ఆ తరువాత చేసిన అరవిందసమేత, అలవైకుంఠ పురం సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.దీంతో తెలుగు, హిందీ సినిమాలలో కూడా ఈ భామ నటిస్తోంది.

అయితే తమిళ సినిమా చేసి ఎనిమిదేళ్లు అవుతోందని పూజా హెగ్డే అంటోంది.మిగతా భాషల్లో సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తమిళ సినిమా చేయాలని ఉందని పూజా తెలిపింది.

Advertisement

ప్రస్తుతం పూజా హిందీలో సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దివాళీ సినిమాలలో నటిస్తోంది.తెలుగులో నటించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సల్మాన్ ఖాన్ తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక పూజా బాలీవుడ్ లో సెటిలయ్యే అవకాశం కనిపిస్తోంది.మరి అందరూ హీరోయిన్లలా బాలీవుడ్ కి వెళ్ళాక సౌత్ ను వదిలేసినట్టు, పూజా అటు ఇటు బ్యాలన్స్ చేస్తుందో లేక బాలీవుడ్ కే పరిమితమవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు