మహనీయులను కుల, వర్గ ప్రతినిధులుగా చూడటం సరైనది కాదు:- తెలంగాణ బహుజన జేఏసీ

మహనీయులను కేవలం ఒక వర్గ ప్రతినిధులుగా చూడటం తగదని తెలంగాణ బహుజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ బానోతు బద్రు నాయక్ , జిల్లా చైర్మన్ పోత గాని వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల ను గిరిజనుల కమిటీ ఆధ్వర్యంలో, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జయంతులను దళితుల కమిటీ ఆధ్వర్యంలో, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని బీసీల కమిటీ తో కులాల వారిగా, వర్గాల కార్యక్రమాలు నిర్వహించడం వారిని అవమానపరచడమే అన్నారు.కులం ,వర్గం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల వల్ల మహనీయులు కేవలం ఒక కులం, ఒక వర్గం కు చెందిన నాయకులు గానే చిత్రీకరించే ఒక ప్రణాళిక అమలు చేయాలని చూస్తున్నట్లు ఉంది అన్నారు.

 It Is Not Correct To See The Mahanis As Caste And Class Representatives: - Telan-TeluguStop.com

వెంటనే ఇటువంటి చర్యలను ఉపసంహరించుకొని, ఆయా మహనీయుల జయంతి సందర్భంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని కమిటీని నియమించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ఆయా కమిటీలకు చైర్మన్ గా వ్యవహరిస్తుంటారు అని, జిల్లా కలెక్టర్ తో పాటు సి పి సైతం దీనిపై దృష్టి పెట్టి అన్ని వర్గాలను భాగస్వాములు చేస్తూ మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించాలని కోరారు.

ప్రభుత్వమే ఈ విధంగా , అధికారికంగా ఆయా వర్గాల కమిటీలను ఏర్పాటు చేసి, కార్యక్రమం తలపెట్టడం శోచనీయమన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube