చంద్రబాబుపై కేసులను ఎత్తివేయాలనడం అవివేకం..: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

టీడీపీ నేతలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అసెంబ్లీ సమయాన్ని టీడీపీ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులను ఎత్తివేయాలని అడగడం అవివేకం అని కోలగట్ల తెలిపారు.అంతేకాకుండా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కవ్వింపు చర్యలకు దిగారని మండిపడ్డారు.

సభలో కావాలనే గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు.ఇకనైనా టీడీపీ సభ్యులు ఇటువంటి చర్యలకు పాల్పడటం మానేయాలని సూచించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో పక్కా ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Advertisement
జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?

తాజా వార్తలు