యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం( Sansthan Narayanapuram ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఒకేసారి తనిఖీ నిర్వహించామన్నారు.ఒక తండాలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న చోట ఒకరు ప్రార్థన సమయానికి హాజరు కాలేదని నోటీసులు జారీ చేశామని తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే సకాలంలో పాఠశాలకు హాజరుకానీ ఉపాధ్యాయులను ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామన్నారు.తొలిమెట్టు కార్యక్రమానికి అన్ని ప్రాథమిక పాఠశాలలో నూటికి నూరు శాతం అమలు చేసి విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సెక్టరల్ అధికారులు,మండల విద్యాధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.