ఉప ఎన్నిక అంటేనే ద‌డ పుడుతోందా.. గులాబీ బాస్ టెన్ష‌న్ ప‌డుతున్నారా..?

తెలంగాణ‌లో మ‌నుగోడు ఉప ఎన్నిక వ‌స్తే ఏంట‌నే దానిపై ప్ర‌ధాన పార్టీలు మ‌ళ్ల‌గుళ్లాలు ప‌డుతున్నాయి.మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నీ సర్దుకుని బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నారు.

 Is The By-election Causing Tension In Kcr Details, Komatireddy Rajagopal Reddy,-TeluguStop.com

మ‌రికొద్దిరోజుల్లో క‌మ‌లం తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయమంటున్నారు.బీజేపీలో చేరితే మ‌రుక్ష‌ణ‌మే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు.

దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయం.అయితే ఉప ఎన్నికపై ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు లెక్క‌లేసుకుంటున్నాయి.

అయితే గెలుపు అంత సులువు కాద‌ని ఆ పార్టీల ప‌రిస్థితిపై ఇప్ప‌టికే ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఇక గులాబీ బాస్ కేసీఆర్ ఉప ఎన్నిక అంటేనే అస్స‌లు ప‌డ‌టంలేద‌ట‌.

ఉప ఎన్నికలంటేనే ఆమడదూరం పరిగెత్తుతున్న పరిస్థితి.కార‌ణం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలే అని చెప్పాలి.

ఎంతో చేసినా ఈ రెండు ఉప ఎన్నిక‌ల్లో ఫ‌లితం శూన్యం.పైగా టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారే కావడంతో కేసీఆర్ కు మింగుడు ప‌డ‌టం లేద‌ట‌.

ఇక‌ ఇప్పుడు మ‌రో ఉప ఎన్నిక అంటేనే కేసీఆర్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాడ‌ట‌.ఒక‌ప్పుడు టీఆర్ఎస్ అంటేనే ఉప ఎన్నికల పార్టీగా ముద్ర పడిపోయింది.

ఉద్యమకాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హ‌యాంలో ఊ.రాజీనామాలు చేయడం.ప్రజల్లోకి వెళ్లడం.వారు గెలిపించడం జ‌రిగింది.తెలంగాణలో మొదటి టెర్మ్ లో కూడా జహీరాబాద్ ఉప ఎన్నిక సహా పలు చోట్ల చనిపోయిన ఎమ్మెల్యేల సీట్లను ఈజీగా గెలిపించుకున్నారు.ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఉప ఎన్నిక అంటేనే భ‌య‌ప‌డుతున్నార‌ట‌.

కోమ‌టిరెడ్డికి క‌ష్ట‌మే.

Telugu Cm Kcr, Congress, Komatirajagopal, Mlarajagopal, Munudodu, Munugodu, Tela

ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మళ్లీ గెలవడం క‌ష్ట‌మ‌నే అంటున్నారు.కార‌ణం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఏమిలేద‌ని… ఉప ఎన్నిక వస్తే ఓడించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నార‌ని అంటున్నారు.ఇక పోటీ చేసేది ఎలాగో బీజేపీ నుంచే.

ఈ పార్టీకి ఇక్క‌డ క్యాడ‌ర్ లేదు.పైగా కాంగ్రెస్ కంచుకోట‌లోని సీటు కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌ద‌నే అంటున్నారు.

అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు అన్న వెంకటరెడ్డిని అండ‌దండ‌లు ఉండేవి.ఇప్పుడు వెంక‌ట్ రెడ్డి సైడ్ అవ్వ‌క‌త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే రాజగోపాల్ రెడ్డి అనుచరగణం సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు.దీంతో బీజేపీ నుంచి రాజ‌గోపాల్ రెడ్డి ఓడిపోవడం పక్కా అంటున్నారు.

ఇక మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే కాంగ్రెస్ కు మరో నేత కావాలి.ఇక్కడ త‌మ్ముడిపై వెంకటరెడ్డిని పోటీ చేసే ప‌రిస్థితి లేదు… పోనీ మరో బ‌ల‌మైన నేత ఉన్నాడా అంటే అదీ లేదు.

ఇలా అన్ని పార్టీల‌కు ఉప ఎన్నిక చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube