ఆ నిర్ణ‌యం జ‌గ‌న్‌కు విమ‌ర్శ‌లు తెస్తోందా..?

ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు చివ‌ర‌కు ఆయ‌న మీద విమ‌ర్శ‌లు తీసుకువ‌స్తున్నాయి.

ఇప్ప‌టికే ఆయ‌న ఒక‌ప్పుడు ప‌ట్టుబ‌ట్టి తీసుకు వ‌చ్చిన కొన్ని విధానాల మీద ఇప్పుడు వెన‌క‌డుగు వేయ‌డ‌మే చివ‌ర‌కు ఇబ్బంది క‌రంగా మారుతోంది.

మొన్న‌టికి మొన్న మూడు రాజ‌ధానుల బిల్లు విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లకు తావిచ్చింది.దాంతో పాటు మండ‌లి ర‌ద్దు బిల్లును కూడా వెన‌క్కు తీసుకోవ‌డం కూడా ఒక‌ర‌కంగా నెగెటివ్ టాక్‌ను తీసుకు వ‌చ్చింది.

ఇప్పుడు మ‌ద్యం విష‌యంలో కూడా ఇలాగే చేయ‌డం గ‌మ‌నార్హం.జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.

ఏపీలో పూర్తిగా మ‌ద్య నిషేధం విధిస్తామ‌ని, ముందుగా ధ‌ర‌లు పెంచితే పేద ప్ర‌జ‌లు మ‌త్తుకు బానిస‌గా కాకుండా ఉంటార‌ని చెప్పుకొచ్చారు.ఇందులో భాగంగా మొన్న‌టి వ‌ర‌కు ధ‌ర‌లు పెంచేసి వాటిని అందుబాటులో లేకుండా కూడా చూశారు.

Advertisement

కానీ ఇప్పుడు మాత్రం ఇక చీప్ లిక్కర్ ని అంతటా తీసుకు రావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.ఇక స‌డెన్ గా మ‌ద్యం ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం త‌గ్గించ‌డమే ఆశ్చ‌ర్యంగా ఉంది.

ఇక ప్ర‌జ‌లు ఎక్కువ‌గా తాగే మెయిన్ బాండ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా చెప్పింది.

బాటిల్ ఒక్కింటికి రూ.200 త‌గ్గించ‌డ‌మే ఇప్పుడు షాకింగ్ గా ఉంది.మొన్న‌టి దాకా ధ‌ర‌ల‌ను ఇంకా పెంచి ఎవ‌రికీ అందుబాటులో లేకుండా చేస్తామ‌ని, చివ‌ర‌కు ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కే ప‌రిమితం చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.

ఇప్పుడు మ‌డ‌మ తిప్పేశార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.మ‌ద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఇదే ప్ర‌తిప‌క్షాల‌కు మంచి ఛాన్స్ గా మారిపోయింది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద టీడీపీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తోంది.అంటే జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింద‌న్న మాట‌.

Advertisement

తాజా వార్తలు