మహేష్ బాబు నమ్రత ( Mahesh Babu-Namrata ) ఇండస్ట్రీలోనే చూడ చక్కని జంటగా ఇద్దరు పిల్లలతో ఎలాంటి వివాదాలు లేకుండా చాలా చక్కగా వారి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.ఓవైపు మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబాన్ని మాత్రం మర్చిపోరు.
సినిమాలు పక్కన పెట్టైనా సరే కుటుంబంతో మూడు నెలలకి ఒక్కసారైనా వెకేషన్ కి వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడైతే మహేష్ బాబు నమ్రత చాలా హ్యాపీగా ఉంటున్నారు.
కానీ పెళ్లయిన కొత్తలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందని వార్తలు నెట్టింట చాలా వైరల్ గా మారాయి.ఇక వీరి విడాకుల వార్తలు చూసిన చాలామంది మహేష్ బాబు అభిమానులు తమ అభిమాన హీరో ఎందుకు విడాకులు తీసుకోబోతున్నాడో తెలియక సతమతమయ్యారు.
అయితే గతంలో మహేష్ బాబు నమ్రత మధ్య కొన్ని విషయాల్లో గొడవలు వచ్చాయట.మరీ ముఖ్యంగా ఓ హీరోయిన్ విషయంలో నమ్రత మహేష్ బాబు పై చాలా సీరియస్ అయిందని మీడియాలో కొన్ని వార్తలు వినిపించాయి.
ఇక అసలు విషయం ఏమిటంటే.మహేష్ బాబు నమ్రత 2005 ఫిబ్రవరి 10న చాలా సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు.
ఇక వీరు పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత హీరోయిన్ త్రిష ( Trisha ) వల్ల నమ్రత కి ఓ విషయంలో కోపం వచ్చిందట.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నమ్రత మహేష్ బాబు ఇద్దరూ వంశీ సినిమా టైం లో లవ్ లో పడి చాలా సంవత్సరాలు వారి ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు.అయితే 2005లో వీరి పెళ్లి జరగడం కంటే ముందే అతడు సినిమా ( Athadu Movie ) లో మహేష్ బాబు కి జోడిగా త్రిష నటించింది.

ఈ సినిమా తర్వాత మళ్లీ మహేష్ బాబు త్రిష ( Mahesh Babu-Trisha ) కాంబినేషన్ లో సైనికుడు సినిమా ( Sainikudu Movie ) వచ్చింది.ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీలో కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.అవేంటంటే.ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాల్లో చేస్తే కచ్చితంగా వారి మధ్య ఏదో నడుస్తుంది అని రూమర్స్ గుప్పుమంటాయి.అలాంటిదే మహేష్ బాబు త్రిష విషయంలో కూడా జరిగిందట.

అంతేకాకుండా అప్పటికే త్రిష ప్రభాస్ ( Prabhas ), విజయ్ వంటి హీరోలతో లవ్ ట్రాక్ నడిపిందనే విషయం తెలుసుకున్న నమ్రత తన భర్తని ఎక్కడ ప్రేమలో పడేస్తుందోనన్న భయంతో ఆ సినిమా చేసే టైంలో మహేష్ బాబు తో గొడవ పడిందట.కానీ ఆ తర్వాత మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఎలాంటి సంబంధం లేదు.అది కేవలం సినిమా షూటింగ్లో మాత్రమే ఉన్న సంబంధం అని తెలుసుకున్న నమ్రత తర్వాత ఆ విషయంలో గొడవ పడడం మానేసిందట.
అందుకే ఆ సమయంలో మహేష్ బాబు నమ్రత మధ్య గొడవలు జరుగుతున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.







