ప్రపంచ బడా సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్తో యూజర్లని ఆకట్టుకునే దిశగా అడుగులు ముందుకు వేస్తూ వుంది.ఈ క్రమంలోనే తాజాగా ‘నోట్స్’ అనే కొత్త ఫీచర్తో ముందుకు వచ్చేసింది.
ఇకపై యూజర్స్ ‘నోట్స్’తో తమకు నచ్చింది రాసి, ఇతరులతో పంచుకోవచ్చు. ఈ ఇన్స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్.
స్టేటస్ను పోలి ఉంటుంది.స్టేటస్ అనేది న్యూస్ ఫీడ్లో కనిపిస్తే.నోట్స్ ఫీచర్ మాత్రం డీఎంలో ఉంటుంది.24గంటల తర్వాత మనం రాసే నోట్స్ డిలీట్ అయిపోతుంది.
కాబట్టి ఇది ఒక స్టేటస్ లాగే పనిచేస్తుందని అర్ధం చేసుకోవచ్చు.ఈ నోట్స్ ఫీచర్కు 60 క్యారెక్టర్ లిమిట్ కూడా ఉంది.ఇది యూజర్లు గమనించగలరు.సమాచారాన్ని తొందరగా, సింపుల్గా పంచుకోవడం కోసం ఈ ఫీచర్ను యూజర్లముందుకు తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్.
అయితే యూజర్ల నుంచి ఈ ఫీచర్పై మిశ్రమ స్పందన రావడం కొసమెరుపు.కొంతమంది అద్భుతమైన ఫీచర్ అని కొనియాడగా మరికొంతమంది ఇదొక చెత్త ఫీచర్ అని పెదవి విరుస్తున్నారు.
అయితే ఇపుడు ఇన్స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
1: ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది.
2: ఆ తరువాత ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేయండి.
3: తరువాత డీఎం సెక్షన్లోకి వెళ్ళాలి.
4: అక్కడ పైన కనిపిస్తున్న ‘యువర్ నోట్’పై క్లిక్ చేయండి.మీకు ఏదైతే రాయాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేయండి.
5: ఫాలోవర్స్, క్లోజ్ ఫ్రెండ్స్.ఎవరికి కనిపిచాలో సెలక్ట్ చేసుకోండి.
6: ఇపుడు చివరగా షేర్ బటన్ ప్రెస్ చేస్తే.మీ నోట్స్ షేర్ అవుతుంది.