రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయిన్పల్లి మండల వ్యాప్తంగా గురువారం రోజు స్పెషల్ డ్రైవ్ లో వాహనాల తనిఖీ నిర్వహించిన ఎస్సై మహేందర్.ఇట్టి తనిఖీల్లో వాహనాలు నెంబర్ ప్లేట్లు పై నెంబరు సరిగా లేని వాహనాలను నెంబరు వ్రాయించడం జరిగిందని.
ప్రతి ఒక్క వాహనదారుడు నెంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించేలా ఉండాలని, త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని వాహనదారులు వారి వెంట తప్పనిసరిగా పత్రాలు ఉంచుకోవాలని హెల్మెట్ ధరించాలి లేనియెడల చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మహేందర్( SI Mahender ) తెలిపారు.