వర్క్ ప్లేస్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి మరణానికి కారణమైన భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్ట్( Singapore Court ) 18 వారాల జైలు శిక్ష విధించినట్లు ఆ దేశ మానవశక్తి మంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది.నిందితుడు సర్టిఫైడ్ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
ఆసియాబిల్డ్ కన్స్ట్రక్షన్లో( Asiabuild Construction ) ఉద్యోగం చేస్తున్న అలగప్పన్ గణేశన్ను( Alagappan Ganesan ) 2022 జూలై 7 నాడు జరిగిన ప్రమాదానికి సంబంధించి వర్క్ ప్లేస్ సేఫ్టీ అండ్ హెల్త్ (డబ్ల్యూఎస్హెచ్) యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ చేశారు.అనంతరం ఆగస్ట్ 15న శిక్ష విధించినట్లు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
జూలై 7, 2022న గణేశన్ బహుళ అంతస్తుల కార్ పార్కింగ్లో ఫోర్క్ లిఫ్ట్ నడుపుతున్నాడు.అదే సమయంలో భారత సంతతికే చెందిన కుంజప్ప మకేష్, సహోద్యోడి ఒకరు కేబుల్స్ వేస్తున్నారు.

ఫోర్క్లిఫ్ట్ ద్వారా కేబుల్ నడపడకుండా నిరోధించడానికి కుంజప్ప,( Kunjappa Makesh ) మరో వ్యక్తి ఫోర్క్లిఫ్ట్ మీదుగా కేబుల్ను విసిరేందుకు ప్రయత్నించారు.అయితే అది దాని వెనుక భాగంలో పడింది.కుంజప్ప ఫోర్క్ లిఫ్ట్ వెనుక భాగంలో ఎక్కగా.గణేశన్ యంత్రాన్ని రివర్స్ చేయడం ప్రారంభించాడు.ఫలితంగా కుంజప్ప ఫోర్క్లిఫ్ట్ ఓవర్ హెడ్ గార్డ్, బీమ్ మధ్య చిక్కుకుపోయాడు.వెంటనే అప్రమత్తమైన తోటి ఉద్యోగులు అతనిని ఆసుపత్రికి తరలించగా.
తీవ్ర గాయాల కారణంగా కుంజప్ప ప్రాణాలు కోల్పోయినట్లు ఛానెల్ న్యూస్ ఆసియా తెలిపింది.

ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్గా ( Forklift Operator ) విధులు నిర్వర్తించడంలో గణేశన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు మానవ శక్తి మంత్రిత్వ శాఖ పరిశోధనల్లో తేలింది.యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి ముందు అతను ఎలాంటి ముందస్తు తనిఖీలు చేయలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.ఫోర్క్లిఫ్ట్లు, క్వే క్రేన్లు వంటి యంత్రాల ఆపరేటర్లు పని ప్రదేశాల్లో ఎల్లవేళలా అప్రమత్తంగా వుండాలని, చుట్టుపక్కల వున్న కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.