ఇండియాలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది.ప్రతి రోజు కూడా వేల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది.తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 62,212 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74,32,681కి చేరింది.
అలాగే , నిన్న ఒక్క రోజే 837 మంది మరణించగా, దేశం మొత్తం మీద ఇప్పటివరకు మొత్తం 1,12,998 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇక పోతే , దేశంలో గడిచిన 24 గంటల్లో 65,24,596 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,95,087గా ఉంది.కరోనా రోగుల రికవరీ రేటు 87.78 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.52 శాతానికి తగ్గింది.గడిచిన 24 గంటల్లో 9,99,090 కరోనా టెస్టులు చేయగా, ఇప్పటి వరకు మొత్తం 9,32,54 017 టెస్టులు నిర్వహించారు.దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి… 87.8 శాతానికి చేరింది.ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల్లో అమెరికా అగ్రస్థానం లో కొనసాగుతోంది.