మునుగోడు ఉపఎన్నికలో రోజూ ఏదో ఒక చోట పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.తాజాగా ‘ఖబడ్డార్ బీజేపీ.
మీకు గోరీ కడతాం’ అంటూ లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు అతికించారు.నిన్న అర్థరాత్రి చండూరు మున్సిపాలిటీలో ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లను కొనాలని ఆ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని పోస్టర్లలో విమర్శించారు.