మరి కాసేపటిలో బీజేపీ( BJP ) లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మేరకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ నేతలు అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ గఢ్ మరియు గోవా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.కాగా సిట్టింగ్ లలో దాదాపు 30 శాతం మంది నేతలకు టికెట్లు లేవని తెలుస్తోంది.
తొలి జాబితాలోనే ఎక్కువ మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.







