ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది.ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.







