ప్రపంచమే నేడు స్మార్ట్ స్మార్ట్ గా మారిపోయింది.అదేనండి, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ వెహికల్స్ స్మార్ట్ సిటీ అంటూ స్మార్ట్ స్మార్ట్ గా తయారవుతోంది.
ఇలాంటి స్మార్ట్ యుగంలో స్మార్ట్ గా థింక్ చేయకపోతే ఇక అంతే.బతకడం ఒకింత కష్టమే.
ఇకపోతే ప్రస్తుత యువతకు స్మార్ట్ ఫోన్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయిందంటే అతిశయోక్తి లేదు.ముఖ్యంగా ఫోన్లో సోషల్ మీడియాలో మనవాళ్ళు ఎక్కువగా బ్రౌజింగ్ చేస్తూ వున్నారు.
అందులో ప్రధానమైనది ఫేస్బుక్.అవును, ఇపుడు ఎక్కువ మందిని ఆకట్టుకున్న సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ఫేస్బుక్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఈ క్రమంలో ఫేస్ బుక్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా జరుగుతోంది.ముఖ్యంగా పోటీ పరీక్షల సమయంలో కూడా యువత సోషల్ మీడియా నుంచి బయటకు రాలేకపోతున్నారు.అందుకే నిపుణులు ఏం చెబుతున్నారంటే, ముఖ్యంగా స్టూడెంట్స్ ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ… బంగారు భవిష్యత్ కావాలనుకునేవారు దాదాపుగా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలకు స్వస్తి చెబితేనే మంచిదని సూచిస్తున్నారు.అది కూడా చేతకాకపోతే కనీస పరీక్షల సమయంలో అయినా దానిని షట్ డౌన్ చేయాలని అంటున్నారు.
అయితే ఇలా చేయాలని అనుకునే వారు సోషల్ మీడియాలో వున్న కంటెంట్… ముఖ్యంగా ఫొటోలను ఏం చేయాలి? అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంటారు.ఎందుకంటే అందులో కుటుంబం లేదా స్నేహితులతో ఎంజాయ్ చేసిన మధుర స్మృతులు అనేకం ఉంటాయి.ఇలాంటి వారి కోసం ఫేస్ బుక్ ఓ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఫోటోలు, వీడియోలను ఇతర ప్లాట్ ఫామ్స్కు బదిలీ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది.
ముఖ్యంగా యూజర్లు తాము అప్ లోడ్ లేదా డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోలు డైరెక్ట్గా గూగుల్ ఫొటోస్కు సెండ్ చేసే అవకాశం కల్పిస్తుంది.