వైరల్: ఈ ఏనుగు చేసిన పనికి వావ్ అనకుండా ఉండలేము..!

గ్రీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అంటూ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ ఇది అందరికీ తెలిసిందే.

ఇందులో భాగంగా చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేయాలని ఒకపక్క నాయకులు మరోపక్క అధికారులు గ్రామగ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరీ ప్రజలను చైతన్య పరిచారు.

దీని ద్వారా ప్రజల్లో పెద్ద మార్పును తీసుకు రాగలిగారు.అయితే చాలామంది ఇప్పటికీ ఎక్కడపడితే అక్కడ చెత్తను పడేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోక పోవడం, ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం లాంటివి చేస్తూ ఉన్నారు.

అయితే మనుషులు చేయని ఈ పని జంతువులు చేస్తే ఎలా ఉంటుంది.కనీసం జంతువుల నైనా చూసి మనుషులు బుద్ధి తెచ్చుకుంటే బాగుండు అనిపిస్తుంది.

అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఓ ఏనుగు పాటిస్తుంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఇందులో ఓయ్ ఏనుగు ఇంటి బయట పడేసిన చెత్తను తన తొండంతో తీసి చెత్తబుట్టలో పడేస్తుంది.చెత్తను ఎక్కడ పడితే అక్కడ మనుషులు పడేస్తూ ఉంటే, జంతువైన ఏనుగు మాత్రం చాలా జాగ్రత్తగా చెత్తను ఏసీ పద్ధతిగా చెత్తబుట్టలో వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

దీంతో జంతువు అయిన ఏనుగు చెత్తను చెత్త బుట్టలో వేయడంతో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.ఏనుగును చూసి మనుషులు నేర్చుకోవాలని కొందరు, నువ్వు స్వచ్ఛభారత్ లో ఇలా పాల్గొంది అని కొందరు, మనుషులకన్నా జంతువులే మేలు అని మరి కొందరు కామెంట్లు పెట్టడం గమనార్హం.ఏదిఏమైనా జంతువుల్ని చూసి అయినా మనుషులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని పాటిస్తే సమాజం స్వచ్ఛంగా ఉంటుందన్నది పలువురి అభిప్రాయం.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు