బుల్లితెర పై ప్రసారమయ్యే కార్యక్రమాల ద్వారా ఎంతో మంది గుర్తింపు సంపాదించుకున్న జోడీలలో సుధీర్ రష్మీ జోడి ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత వర్ష, ఇమ్మానియేల్ జోడి ఉంటుంది.ఆన్ స్క్రీన్ పై ఈ జోడీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఈ రెండు జోడి లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇదే విషయాన్ని క్యాష్ చేసుకున్న నిర్వాహకులు వీరి చేత ఎన్నో కార్యక్రమాలలో సందడి చేయించారు.
ఇకపోతే వీరి రిలేషన్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఈ జోడీలు తమ రిలేషన్ పై స్పందిస్తూ కేవలం ఫ్రెండ్ షిప్ అంటూ సమాధానం చెప్పారు.
ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ఎప్పటిలాగే తనదైన శైలిలో పంచ్ వేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీర్ రష్మీ జోడి విడిపోయిన విషయం మనకు తెలిసిందే.
సుధీర్ ఈటీవీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు.
ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా వర్ష సుధీర్ రష్మీ జోడికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో అందుకే వారిద్దరు విడిపోయారని చెప్పగా వెంటనే హైపర్ ఆది స్పందిస్తూ వారిది దిష్టి జోడి.మీది ముష్టి జోడి అంటూ వర్ష, ఇమ్మానియేల్ జోడీలను దారుణంగా కించపరిచారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజెన్లు ఆది నోటి దూలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇదంతా స్కిట్ లో భాగమని తెలిసిన పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తాజా వార్తలు