జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: గతంలో జర్నలిస్టులకు( Journalists ) కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రెస్ క్లబ్( Press Club ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

 Houses Should Be Distributed To Journalists-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, సమస్య పరిష్కారం కోసం కోర్ట్ లో కౌంటర్ ఫైల్ సమర్పించాలని స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశించినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube