యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.మొన్నటి వరకు ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా లవ్ స్టోరీ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది.ఇక ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా లవ్ స్టోరీ సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది.
ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి నటన అద్భుతం అంటూ చుసిన వారంతా పొగుడుతున్నారు.ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇంత త్వరగా జనాలలోకి రావడానికి నాగ చైతన్య, సాయి పల్లవి నటన అయితే మరొక కారణం మ్యూజిక్ అనే చెప్పుకోవాలి.
మ్యూజిక్ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.అన్ని సాంగ్స్ వేటికవే చార్ట్ బస్టర్ గా నిలిచాయి.
కరోనా తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ సినిమాతో థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.అయితే ఈ సినిమాపై తాజాగా హిందూ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో ఒక సీన్ లో పూజ గదిలో లక్ష్మి దేవితో పాటు జీసస్ ఫోటో కూడా ఉంది.ఇలా రెండు దేవుళ్ళ ఫోటోలు పక్క పక్కనే ఉండడంటి హిందువులు ఆగ్రహం చెందుతున్నారు.
ఇక్కడ అవసరం లేకపోయినా శేఖర్ కమ్ముల అన్ని మతాల ప్రేక్షకులను అలరించడానికి ఇలా చేసాడని.కానీ ఈ పద్ధతి సరి అయినది కాదని హిందువులు చెబుతున్నారు.అదే చర్చీలలో, మసీదుల్లో ఇలా పక్క పక్కనే హిందూ దేవుళ్లను పెట్టగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి ఫోన్ రింగ్ టోన్ కూడా శిరిడీ సాయి బాబా రింగ్ టోన్ పెట్టుకుని ఫోన్ వచ్చిన ప్రతిసారి చిరాకుగా కనిపించి అవమానించారని ఆగ్రహిస్తున్నారు.ఆ సీన్ తొలగించాలని లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.ఇక ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.