గుంటూరు జిల్లా తాడేపల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.ఇంటి లోపలికి వెళ్లేందుకు తంబళ్లపల్లె నేత శంకర్ యాదవ్( Shankar Yadav ) అనుచరులు ప్రయత్నించారు.
వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే టీడీపీలో చేరేందుకు పార్థసారథి,( Parthasaradhi ) బొప్పన భవకుమార్( Boppana Bhavakumar ) భారీ ర్యాలీగా అనుచరులతో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
అప్పటికే టికెట్ కేటాయింపు విషయంలో తంబళ్లపల్లె టీడీపీ నేత శంకర్ యాదవ్ అనుచరులు ఆందోళన చేస్తున్నారు.ఈ క్రమంలో పార్థసారథి అనుచరులతో కలిసి ఆందోళనకారులు కూడా సెక్యూరిటీ దాటి లోపలికి వెళ్లేందుకు యత్నించారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.