సెలబ్రిటీల అందరూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి చిన్న విషయాన్ని ఫోటోలు వీడియోల రూపంలో సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.సెలబ్రెటీలు వారి స్టేటస్ కి తగ్గట్టుగా బంగ్లాలు, కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారు.
ఇదే తరహా లోనే ఇటీవల కోలీవుడ్ యంగ్ హీరోయిన్ రమ్యపాండ్యన్ తనకి ఇష్టమైన లక్సరీ కారు కొనుగోలు చేసి తన చిరకాల కోరిక తీర్చుకుంది.ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోయిన్లు చాలామంది లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు.
రమ్యపాండ్యన్ కూడా వారి బాటలోనే తనకి ఇష్టమైన బీఎండబ్ల్యూ లగ్జరీ కారును కొనుగోలు చేసింది.
రమ్యపాండ్యన్ ‘డమ్మీ పట్టాసు’ అనే సినిమా ద్వారా కోలీవుడ్ పరిశ్రమకు హీరోయిన్గా అడుగు పెట్టింది.
ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు రాకపోయినా.జోకర్ సినిమా ద్వారా రమ్యపాండ్యన్ కి మంచి గుర్తింపు వచ్చింది.
ఈ సినిమా తర్వాత కూడా రమ్యపాండ్యన్ కి సిల్వర్ స్క్రీన్ మీద నటించే అవకాశాలు పెద్దగా రాకపోవటంతో బుల్లి తెర మీద దృష్టి సారించింది.బుల్లి తెర మీద పలు టీవీ షో లకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది.
అంతే కాకుండా బుల్లితెర మీద ప్రసారమయ్యే కొన్ని కుకింగ్ షోస్ లో, బిగ్ బాస్ లో కూడా రమ్యపాండ్యన్ పాల్గొంది.
సిల్వర్ స్క్రీన్ మీద నటించడం వల్ల పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ బుల్లితెర మీద తను పాల్గొన్న కార్యక్రమాల వల్ల రమ్య పాండ్యన్ కి మంచి గుర్తింపు లభించింది.రమ్యపాండ్యన్ నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ అన్న కుమార్తె కావటం గమనార్హం.ప్రస్తుతం రమ్యపాండ్యన్ రెండు సినిమాలలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే రమ్యపాండ్యన్ ఇటీవల తన డ్రీమ్ కారుని కొని దానితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇదిలా ఉండగా ఇటీవల బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకునీ హీరోయిన్ల గా రాణిస్తున్న సాక్షి అగర్వాల్, శివాని నారాయణన్ కూడా లాక్సరీ కార్లు కొనుగోలు చేశారు.