ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా సెలబ్రిటీలు ఒకటి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.అయితే కొందరు సెలబ్రిటీలు వారి పెళ్లి విషయాన్నీ పెళ్లికి ముందే అధికారికంగా ప్రకటించగా మరికొందరు మాత్రం ఊహించిన విధంగా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు నెటిజన్స్ కి షాక్ ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉండే హీరోయిన్ స్వర భాస్కర్ పెళ్లి విషయంలో ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.సమాజ్వాదీ పార్టీ నేత ఫహాద్ అహ్మద్ను రహస్యంగా పెళ్లాడిన ఆమె ఆలస్యంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ ఏడాది జనవరి 6న అహ్మద్ను సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా తన పెళ్లి ప్రకటనను నెల రోజుల తర్వాత ప్రకటించి ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది.మరో బాలీవుడ్ నటి మాన్వి గాగ్రూ.ఈమె కమెడియన్ కుమార్ వరుణ్ను పెళ్లాడిన విషయం తెలిసిందే.అయితే జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఫిబ్రవరి 23న పెళ్లి పీటలెక్కింది.కాగా ఎంగేజ్మెంట్ విషయాన్నీ ఆలస్యంగా ప్రకటింఛీ షాక్ ఇచ్చింది ఈ జంట.అలాగే వివాహానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండ జాగ్రత్త పడ్డారు.కనీసం పెళ్లంటూ రూమర్స్ కూడా వినిపించలేదు.దీంతో పెళ్లి అనంతరం ఒక్కటయ్యామంటూ వీరిద్దరూ నెట్టింట ఫొటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరో బాలీవుడ్ నటి చిత్రాశి రావత్ కూడా రహస్యంగా పెళ్లి పీటలెక్కింది.నటుడు, వాయిస్ ఆర్టిస్ట్, ప్రియుడు అయిన ధృవాదిత్య భగ్వనానీని ఫిబ్రవరి 4న పెళ్లాడింది.ఛత్తీస్ఘడ్లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు.సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి సందడిని అభిమానులతో పంచుకుంది.దీంతో క్షణాల్లో ఈ ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి.కాగా ఈమె పెళ్ళికి ముందు కూడా ఎటువంటి హంగామా కనిపించలేదు.
అలాగే సాత్ నిభానా సాతియా సీరియల్ నటి దేవలీనా భట్టాచార్జి కూడా సీక్రెట్గానే పెళ్లిపీటలెక్కింది.గతేడాది డిసెంబర్లో తన ప్రియుడితో ఏడడుగులు వేసింది.
అయితే ఆమె అదే విషయాన్ని ఆలస్యంగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది.అదేవిధంగా ఇటీవల బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ కూడా పెళ్లిపీటలెక్కింది.
బాయ్ఫ్రెండ్, నటుడు రిబ్బు మెహ్రాను పెళ్లాడింది.ఫిబ్రవరి 25న గుట్టుచప్పుడు కాకుండా వీరి పెళ్లి జరిగింది.
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని రిబ్బు నివాసంలో ఈ జంట పెళ్లి జరిగింది.