పిచ్చి ప్రేలాపనలకు జవాబివ్వండి

మీరు పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడారు? వారం రోజుల్లో జవాబు ఇవ్వండి.

అని జాతీయ మహిళా కమిషన్‌ కాంగ్రెసు నాయకుడు గురుదాస్‌ కామత్‌కు నోటీసు ఇచ్చింది.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురించి గురుదాస్‌ కామత్‌ అసభ్యంగా, అభ్యంతరకరంగా, అవమానకరంగా మాట్లాడిన సంగతి తెలుసు.విద్యాగంధం లేని స్మృతి ఇరానీకి మంత్రి పదవి ఇవ్వడం వెనక ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగతమైన ఆసక్తి ఉందని ఏవో అర్థాలు వచ్చేలా కామత్‌ మాట్లాడారు.

ఆమె వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్‌లోనే వ్యంగ్య ధోరణిలో వివరించారు.కామత్‌ ప్రేలాపనలపై విమర్శలు చెలరేగడంతో జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది.

మీ అవాంఛిత వ్యాఖ్యలపై వారం రోజుల్లో జవాబు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ లలితా కుమారమంగళం నోటీసు పంపారు.చాయ్‌వాలా (నరేంద్ర మోదీ) ప్రధాని అయితే హోటల్లో టేబుళ్లు శుభ్రం చేసినామె మంత్రి అయిందని ఎద్దేవా చేయడం కామత్‌ స్థాయిని దిగజార్చింది.

Advertisement

కామత్‌ చిన్నోడేం కాదు.అరవై ఏళ్లున్నాయి.

ఈమధ్య మతి స్థిమితం లేనట్లుగా మాట్లాడేవారు, మహిళల పట్ల అగౌరవమైన వ్యాఖ్యలు చేసేవారు వయసు మళ్లిన నాయకులే కనబడుతున్నారు.వీరికి వయసు పెరుగుతున్నా బుద్ధి ఎదగడంలేదు.

Advertisement

తాజా వార్తలు