ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రంజాన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఏ రోజు అయితే నెలవంక వస్తుంది ఆ తెల్లారే రంజాన్ ను సెలబ్రేట్ చేసుకుంటారు.
అయితే గల్ఫ్ దేశాల్లో సోమవారం రాత్రే నెలవంక కనిపించడం తో ఒక్కరోజు ముందే అక్కడ ఈద్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఈ విషయాన్ని సౌదీలోని మక్కా మసీదు ఇమామ్ ప్రకటించారు.
సోమవారం రాత్రే నెలవంక కనిపించడం తో గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఒమన్, ఖతర్, ఇరాన్, ఇరాక్ తదితర గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఈద్-ఉల్-ఫితర్ను ఈ రోజే జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.

అయితే మరోపక్క ఇక భారత్లో మంగళవారం రాత్రి నెలవంక కనిపించే అవకాశం ఉందని మత పెద్దలు భావిస్తున్నారు.ఒకవేళ అదే జరిగితే బుధవారం భారత్ లో ఈద్ పండగ జరుపుకోనున్నారు.సాధారణంగా ప్రతిసారి కూడా గల్ఫ్ దేశాల్లో ఈద్ జరుపుకున్న మరుసటి రోజు భారత్లో ఆ పండుగ వస్తుంది.
ఎప్పటిలాగే ఈసారి కూడా గల్ఫ్ దేశాల్లో ఈద్ సంబరాలు జరిగిన తరువాత భారత్ లో కూడా అందరూ ఈద్ పండుగ జరుపుకోనున్నారు.







