అంబటి రాంబాబు పై జరిగిన దాడి ని ఖండిస్తున్నాం.. గుడివాడ అమర్నాథ్

గత 27 వ తేదీన రాంబాబు( Ambati Rambabu ) ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వెళుతుండగా దాడి జరిగింది.వ్యక్తి గతంగా ఆయనను దూషించి దాడులకు ప్రయత్నిస్తున్నారు.

కాపు కులం మీద ఒక సామాజిక వర్గం దూషించి,దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నాం.88 లో వంగవీటి రంగా ని చంపారు.ముద్రగడ్డ పద్మనాభం( Mudragada Padmanabham ) కుటుంబ సభ్యులపైన కూడా దాడులకు పాల్పడ్డారు.

ఒకానొక సభలో అంబటి రాంబాబు ను చంపితే 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు.అంబటి రాంబాబు కు కులం లేదా,ఎవరూ రారనుకున్నారా.ప్రభుత్వం లో ఎంతోమంది కాపులు అధికారంలో ఉన్నారు.

విధాన పరంగా రాంబాబు మాట్లాడతారు.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ముద్రగడ్డ పద్మనాభం పై చేసిన దాడులపై ఎవరూ మాట్లాడలేదే.అవినీతిలో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలులో ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారు.

Advertisement

గమనించాలని ప్రజలను కోరుతున్నా.నిన్న గచ్చిబౌలి లో జరిగిన టీడీపీ సభ ఒక పిక్నిక్ లాగా ఉంది.

నిన్న జరిగిన రైలు ప్రమాద ఘటన వద్దకు ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించ నున్నారు.క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం.

డొక్కా మాణిక్యవరప్రసాద్ కామెంట్స్.అంబటి రాంబాబు పై జరిగిన దాడి ని ఖండిస్తున్నాం.

నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.ఇక్కడ ప్రజలనుండి స్పందన లేదని ప్రక్క రాష్ట్రాం లో మా మంత్రి పై దాడులు చేస్తారా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది - బాలకృష్ణ

దివాలా కోరు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.ఇలాంటి ఘటనలను వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.

Advertisement

తాజా వార్తలు