విషవాయువు లీక్ కారక కంపెనీగా పోరస్ కంపెనీ నిర్ధారణ పోరస్ కంపెనీ లో ఉత్పత్తి నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు గత వారు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో విషవాయువు లీక్ ఘటనపై కాలుష్య నియంత్రణ మండలి కన్నెర్ర చేసింది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూడిన కమిటీ విచారణ కొనసాగిస్తుంది ప్రాథమికంగా పోరస్ అనే కంపెనీ నుంచి ఈ విషవాయువు లీక్ అయినట్టు నిపుణుల కమిటీ భావించింది ఈ మేరకు ఆ కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే ఫరీదా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కంపెనీ నుంచి మిక్స్డ్ గ్యాస్ బయటికి వచ్చినట్లు నిపుణులు భావిస్తున్నారు.







