BRS KCR : BRS విషయంలో సైలెంట్ అయిన కేసీఆర్.. కారణమేంటి?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అక్టోబర్ 5న తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు భారీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

ప్రకటన చేసిన కొద్ది నిమిషాల్లోనే, కేసీఆర్ తన పార్టీ సీనియర్ నాయకులు - బోయినపల్లి వినోద్ కుమార్, శ్రీనివాస రెడ్డిలను న్యూఢిల్లీకి పంపించారు.

తర్వాత పార్టీ పేరు మార్పును తెలియజేస్తూ, దాని ఆమోదం కోరుతూ భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.తన జాతీయ పార్టీ పేరును మార్చిన కేసీఆర్ గుర్తు మాత్రం "కారే" ఉండాలని ECIని కోరారు.

ఇంతవరకు అంతా బాగనే ఉన్న.పార్టీ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్న.

తన జాతీయ పార్టీతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తునని కేసీఆర్ ప్రకటించినా, ఆ దిశగా ఎలాంటి కదలిక లేదు.జాతీయ రాజకీయాలను కుదిపేసే సంగతి పక్కన పెడితే, కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను పూర్తిగా మర్చిపోయినట్లున్నారు.

Advertisement

ఇప్పటి వరకు ఈసీ నుంచి గుర్తింపు పొందేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడంతో ఆ పార్టీని టీఆర్‌ఎస్‌గా పేర్కొంటున్నారు.బీఆర్‌ఎస్‌ను ప్రకటించిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి న్యూఢిల్లీ వెళ్లి దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు.

జాతీయ పార్టీ ఫిలాసఫీ, ఎజెండాను ఖరారు చేసేందుకు వివిధ వర్గాల మేధావులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సీఎంఓ నుంచి లీకులు వచ్చాయి.

కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు, కానీ బీఆర్‌ఎస్ జెండా, ఫిలాసఫీ లేదా ఎజెండా విషయంలో ఎలాంటి మార్పు లేదు.పూర్తిగా మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వేటాడిందన్న ఆరోపణలపై మాత్రమే దృష్టి పెట్టారు.మరి ఇప్పటి నుండి తన జాతీయ పార్టీపై ఎలాంటి ఆలోచన చేస్తారో చూడాలి.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు