యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ టీం ఇప్పుడే మేల్కొన్నట్టు ఉంది.
ఇక లేటెస్ట్ గా బుచ్చి బాబు డైరక్షన్ లో తారక్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.ఈ సినిమా కూడా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టాడట ఎన్.టి.ఆర్ ఎందుకు అంటే సినిమా కథ బాగున్నా సెకండ్ హాఫ్ ఎక్కడో తేడా కొట్టిందని అభిప్రాయపడ్డాడట తారక్.సెకండ్ హాఫ్ ని మార్చి తీసుకు రమ్మని చెప్పారట.
అయితే సుకుమార్ హెల్ప్ తీసుకుని మరీ బుచ్చి బాబు సెకండ్ హాఫ్ మార్చి మళ్లీ ఎన్.టి.ఆర్ కి వినిపించినా అది కూడా ఎన్.టి.ఆర్ కి సరిగా నచ్చలేదట.అందుకే బుచ్చి బాబు ప్రాజెక్ట్ ని కొంత టైం తీసుకోవాలని అనుకున్నారట.కొరటాల శివ సినిమ తర్వాత ఎలాగు ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంది.ఆ మూవీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుంది.సో బుచ్చి బాబు ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత అదే రేంజ్ పాన్ ఇండియా సబ్జెక్ట్ తో ఎన్.టి.ఆర్ ని మెప్పించాల్సి ఉంటుంది.