గోపీచంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో ఎంటర్టైనర్ మూవీగా రాబోతుంది పక్కా కమర్షియల్.ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
మారుతి మార్క్ కామెడీతో గోపీచంద్ ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో ఈ మూవీ వస్తుంది.యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 1న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ గా ఓ క్లారిటీ వచ్చింది.ఈమధ్య ఆడియెన్స్ సినిమా రిలీజైన నెల రోజులకే ఓటీటీలో వస్తుందని థియేటర్లకు రావడం మానేశారు.
పక్కా కమర్షియల్ సినిమా కూడా ఓటీటీలో వస్తుందిగా చూసేద్దాం అనుకోవచ్చు.కానీ థియేట్రికల్ రిలీజ్ కు ఓటీటీ రిలీజ్ కు దాదాపు ఐదారు వారాల టైం పెడుతున్నారట.
సినిమాకు హిట్ టాక్ వస్తే తప్పకుండా ఆడియెన్స్ వచ్చి థియేటర్ లో సినిమా చూసే ఛాన్స్ ఉంటుంది.అందుకే పక్కా కమర్షియల్ సినిమాను ఐదారు వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ చేసేలా డీల్ కుదుర్చుకున్నారట.
పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.