దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్.ఎంతోమంది గొప్ప నాయకులను దేశానికి అందించిన చరిత్ర ఆ పార్టీది.
ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.పార్టీని నడిపించే నాధుడు లేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నప్పటికీ రాహుల్ గాంధీ అసంతృప్తితోనే ఉన్నాడు.
ఆ పదవిని చేపట్టడానికి సోనియాగాంధీ కూడా విముఖత వ్యక్తం చేస్తోంది.
ప్రియాంక, రాబర్ట్ వాద్రా లు కూడా అఇష్టంగానే ఉన్నారు.దీంతో పార్టీకి దిక్కెవరా.? అన్న ప్రశ్న తలెత్తుతుంది.దీంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి తీసికట్టుగా మారుతోంది.
ఈ పార్టీ పరిస్థితి ఇలా కొనసాగుతుండగానే ఈ పార్టీలో దాదాపు 50 సంవత్సరాల పాటు ఉన్న గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం మరింత చర్చనీయాంశం అయ్యింది.
ఈయన ఈ పార్టీలోనే అన్ని పదవులు అనుభవించి ఉన్నారు.
ఇన్నేళ్ల పాటూ కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే ఈ వాదన ఒక సారి పరిశీలిస్తే.
ఆజాద్ రాజినామా కాంగ్రెస్ కు ఎలాంటి దెబ్బ అనేది అర్ధం అవుతుంది.

ఈయన రాజీనామాతో జమ్మూలో మరికొంత మంది కూడా రాజీనామా చేయడంతో దెబ్బ బాగా పడింది అంటున్నారు.కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.ఈయన పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం జమ్మూ కాశ్మీర్ లో పెద్దగా ఈయన చేసిన పనులు ఏమీ లేవని.
ఆయన రెండు సార్లు లోక్ సభలో గెలిచినా అది జమ్మూ నుండి కాదని.
ఈయన ఎప్పుడు కూడా జమ్మూలో అప్పుడప్పుడు మాత్రమే పర్యటించే వారు కానీ ఎప్పుడు ఢిల్లి లోనే ఉండిపోయారంటూ గుర్తు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారు కానీ ఏనాడూ ఈయన పార్టీ కోసం పాటుపడింది లేదు.అందుకే ఈయన రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పోయింది ఏదీ లేదు అని అంటున్నారు.
పార్టీలో ఇన్నేళ్ల పాటు కావాల్సినంత రాబట్టుకుని చివరిలో ఇలా రాజీనామా చేసారు అని.దీని వల్ల కాంగ్రెస్ కు తగిలే షాక్ లేదని అంటున్నారు.