అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు.భారత్ ప్రధానిగా మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.
మోడీతో తనకు మంచి అనుబంధము ఉందని పేర్కొన్నారు.భారతదేశంలో కోసం మోడీ చేస్తున్న కృషి చాలా కష్టతరమైందని పేర్కొన్నారు.
ఇక అమెరికా రాజకీయాల గురించి మాట్లాడుతూ 2024 అమెరికా అధ్యక్షుడు ఎన్నికలలో తనను మళ్ళీ పోటీ చేయాలని అంటున్నారు.
అయితే ప్రస్తుతానికి ఎన్నికల్లో నేనే ముందున్నాను.త్వరలో ఈ విషయం గురించి ఓ నిర్ణయం తీసుకుంటాను అంటూ ఇటీవల ఎన్డిటీవీ ఇంటర్వ్యూలో… డోనాల్డ్ ట్రంప్ తెలియజేశారు.2020 అమెరికా అధ్యక్షుడు ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం జరిగింది.ఆ సమయంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా.అధ్యక్షుడిగా జో బైడెన్ గెలిచారు. అంతర్జాతీయంగా భారత్ మరియు అమెరికా మధ్య బంధం.ఎక్కువగా బలపడింది అంటే అది డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అని చెప్పవచ్చు.
అంతకుముందు అమెరికా వైఖరి ఎక్కువగా భారత విషయంలో పాక్ కి మద్దతు అన్న తరహాలో ఉండేది కానీ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక మాత్రం రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి.