ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి సోమిరెడ్డి సీరియస్ కామెంట్స్..!!

టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి ఏపీ ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరి పండిస్తేనే వ్యవసాయం చేసినట్టు అనే ధోరణి కలిగిన రైతులు అటువంటి ఆలోచన నుండి బయట పడాలని తెలిపారు.

 Former Minister Somireddy's Serious Comments On Ap Govt Somireddy , Chandramohan-TeluguStop.com

రైతులంతా వరి పంట వేస్తే కొనుగోలు చేయటం ప్రభుత్వానికి భారం అని పేర్కొన్నారు.దీంతో వరి పంట వేస్తే కొనుగోలు భారం అని కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.

కాకాని మరియు కన్నబాబు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మూతబడిందని విమర్శించారు.ఇదే సమయంలో దేశంలో పత్తి రైతులే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు.రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో  కంటే తెలంగాణ రైతులే ఎక్కువ వరి పండించారని తెలియజేశారు.వైసిపి హయాంలో రైతులు రోడ్లపైకి వస్తున్నారని అనేక ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ప్రభుత్వంపై సీరియస్ కామెంట్లు చేశారు.

 యాంత్రికరణ, భూసార పరీక్షలు, బిందు సేద్యం ఆగిపోవడం దురదృష్టకరమని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube