అనంతపురం జిల్లా( Anantapur )లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉపాధ్యాయుడు మల్లేష్కు మాజీ మంత్రి పరిటాల సునీత( Paritala Sunitha ) ఆర్థిక సాయం అందజేశారు.మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లెరఘునాథ్ రెడ్డి, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి టీచర్ మల్లేష్ను పరామర్శించారు.
ఉపాధ్యాయుడు మల్లేష్ కుటుంబ సభ్యులకు సునీత ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా మల్లేష్కు పరిటాల సునీత రూ.50వేుల ఆర్థిక సాయం ప్రకటించారు.అనంతరం వారు మాట్లాడుతూ.
వారంలోగా సీపీఎస్ రద్దు చేస్తానన్నారు ఏమైందని ప్రశ్నించారు.ఉపాధ్యాయులకు( teachers ) భయపడి ఎన్నికల విధులకు కూడా దూరం చేస్తున్నారన్నారు.
చదువు చెప్పే ఉపాధ్యాయులతో చేయరాని పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు.ఈ ప్రభుత్వ పతనానికి ఇక ఎన్నో రోజులు లేవని హెచ్చరించారు.