పోలీసులను హెచ్చరించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు..!!

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ పోలీసుల తీరును ఖండించారు.ఇష్టానుసారంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

పోలీసులు పద్ధతి మార్చుకోవాలని చట్టప్రకారం నడుచుకోవాలని సూచించారు.టిడిపికి చెందిన వారిపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టడంతో ఎఫ్.ఐ.ఆర్ లు నిండిపోయాయి అని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అధికారి పేరు గుర్తు పెట్టుకుంటామని భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.అంతే కాకుండా మరికొంత మంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే పోలీస్ వ్యవస్థకి చెడ్డపేరు కలిగే విధంగా ఉందని టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు.అధికారపార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్న ట్లు మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

Advertisement

తాజా వార్తలు