సిక్కింలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.ఈ భారీ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు అయ్యారని తెలుస్తోంది.
ఉత్తర సిక్కింలోని లోహంక్ లేక్ దగ్గర క్లౌడ్ బరస్ట్ తో తీస్తానదిలో ఒక్కసారిగా వరద ఉగ్రరూపం దాల్చింది.ఈ క్రమంలోనే లాంచెన్ వ్యాలీ వెంట ఉన్న ఆర్మీ శిబిరాలను వరద ముంచెత్తింది.
దీంతో అక్కడి ఆర్మీ శిబిరాలు కొట్టుకుపోయాయి.ఈ నేపథ్యంలోనే సుమారు 23 మంది జవాన్లు గల్లంతయ్యారు.
అటు సింగ్టామ్ సమీపంలో వరద ప్రవాహానికి ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి.వెంటనే అప్రమత్తమైన అధికారులు గల్లంతయిన జవాన్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
మరోవైపు వరద పరిస్థితిని సిక్కిం ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
.






