పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం..: డీకే అరుణ

పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు.కొందరు కావాలనే తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీ మారే ప్రసక్తే లేదని, ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతానని డీకే అరుణ స్పష్టం చేశారు.తని నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారంలో పాల్గొంటున్నది కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.

మరోసారి తనపై ఇలా అసత్యాలు ప్రచారం చేస్తే వారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement